byసూర్య | Thu, Jun 20, 2019, 08:18 AM
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ పరిగి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థిని నస్రీన్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. పుస్తకాలు కొనేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.