byసూర్య | Tue, Jun 18, 2019, 01:26 PM
లోక్సభ సమావేశాల రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియజకవర్గం మల్కాజిగిరి నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి లోక్సభలో 17వ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే తొలిసారి ఎంపీగా ఎన్నికైన రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా మొబైల్ ఫోన్లో చూసి తెలుగులో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం కోసం రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తూ ఆహ్వానించడం విశేషం.
పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా రెండో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.