పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేస్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, Jun 18, 2019, 01:26 PM

లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియజకవర్గం మల్కాజిగిరి నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లోక్‌సభలో 17వ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే తొలిసారి ఎంపీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా మొబైల్ ఫోన్‌లో చూసి తెలుగులో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం కోసం రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తూ ఆహ్వానించడం విశేషం. 


పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా రెండో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM