హైదరాబాద్‌ గోల్కొండ ప్రాంతంలో దారుణం

byసూర్య | Tue, Jun 18, 2019, 12:53 PM

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వ్యక్తి పద్నాగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గోల్కొండ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న పద్నాగేళ్ల బాలుడిని ఆదివారం పక్కింట్లో ఉండే అర్షద్ నదీం అనే వ్యక్తి ఏదో సాయం కోసం పిలిచాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అర్షద్ పిలవగానే బాలుడు అతడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అర్షద్ బాలుడిని నిర్బంధించాడు. అనంతరం అతడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు బాలుడు ప్రయత్నించగా అర్షద్ తీవ్రంగా కొట్టాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తర్వాత బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దీనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు నిందితుడు అర్షద్ కోసం గాలిస్తున్నారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు ఓ వైపు ఆందోళన కలిగిస్తుండగా... ఇప్పుడు కామాంధులు అబ్బాయిలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతుండటంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాలుడిపై అత్యాచార ఘటన పాతబస్తీలో తీవ్ర చర్చనీయాంశమైంది. 


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM
రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Wed, May 08, 2024, 08:56 PM