byసూర్య | Mon, Jun 17, 2019, 03:25 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు... తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి చేరుకున్న కేసీఆర్ టీమ్... కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి తదితరులున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో కేసీఆర్ టీమ్కు లంచ్ ఏర్పాటు చేశారు సీఎం జగన్. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు.