byసూర్య | Sat, Mar 23, 2019, 11:03 AM
శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ రవి ఆధ్వర్యంలో అధికారులు ఇవాళ ఉదయం సోదాలు నిర్వహించారు. దుబాయ్, రియాద్ నుంచి వచ్చిన ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 600 గ్రాముల బంగారం, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.