byసూర్య | Thu, Mar 21, 2019, 08:08 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మఖ్దుంపూర్లో బుధవారం అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని జుక్కల్లో 38.9 డిగ్రీలు, బిచ్కుందలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో 39.2 డిగ్రీలు, ఉండవెల్లిలో 38.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 39.1 డిగ్రీలు, నవీపేటలో 38.8 డిగ్రీలు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో 38.9 డిగ్రీలు, కొత్తకోట మండలం 38.8 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.