byసూర్య | Thu, Mar 21, 2019, 08:09 AM
మెదక్: మెదక్ పట్టణ సమీపంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై పిడుగుపడింది. పిడుగు.. వ్యక్తి హెల్మెట్పై పడడంతో ప్రాణాపాయం తప్పగా గాయాలభారిన పడ్డారు. గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమం ఉంది. బాధితులు వెల్దుర్తి మండలం రామయపల్లికి చెందిన నర్సింహుల్, గోపాల్, పిర్యాలుగా గుర్తింపు. నర్సింహులు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.