byసూర్య | Thu, Mar 21, 2019, 08:06 AM
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లకు ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నది.