byసూర్య | Tue, Mar 19, 2019, 05:20 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. 2018 డిసెంబర్ తర్వాత ఇన్ని రోజుల పాటు ర్యాలీ కొనసాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిఫ్టీ గత సెప్టెంబర్ 14 తర్వాత తొలిసారి 11,500 మార్కు పైన ముగియడం కూడా ఈరోజే తొలిసారి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల దూకుడుతో ఈరోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 268 పాయింట్లు ఎగబాకి 38,363కు చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 11,532 వద్ద స్థిరపడింది.