byసూర్య | Tue, Mar 19, 2019, 06:20 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగ సభ నేడు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్కు చేరుకున్నారు. బహిరంగ సభకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎంపీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్ తదితరులు హాజరయ్యారు.