byసూర్య | Tue, Mar 19, 2019, 04:05 PM
హైదరాబాద్ మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సొంత అక్కకి ఎంత గౌరవం ఇస్తానో సబితా అక్కకు అంత గౌరవం ఇస్తా ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఆ కుటుంబం తో నాకు ఉన్న సంబంధం ఏంటో అందరకి తెలుసు.కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాలనుకోవడానికి గల కారణాలేంటో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలు కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ జిల్లా లో ఇంద్రన్న పేరు తెల్వలేనోడు లేదు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరాలి అంటే తెలంగాణ రావాలన్న ఇంద్రన్న. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. నా పై పోటీకి నిలబెట్టడానికి కేసీఆర్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదని అన్నారు