byసూర్య | Tue, Feb 05, 2019, 02:25 PM
వనపర్తి: వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 30 మంది లబ్దిదారులు తమకు వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా తమ ఇంటి ముందు అందుకున్నారు. ఎమ్మెల్యే వారి ఇంటికి వచ్చి చెక్కులు అందజేయడంతో ఆనంద వ్యక్తం చేశారు.