byసూర్య | Tue, Feb 05, 2019, 01:52 PM
హైదరాబాద్ : గోల్కొండ కోట అమ్మవారి ఆలయంలో చోరీ చేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. ఆదివారం ఆలయం వద్దకు చేరుకున్న దుండగులు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయంలోని హుండీలు ఎత్తుకెళ్లేందుకు దుండగులు యత్నించి విఫలమయ్యారు. ఆలయ పూజారి చోరీ యత్నాన్ని గుర్తించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.