byసూర్య | Tue, Jan 22, 2019, 12:20 PM
సిమ్లా: పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటన హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లా సర్వ్ఘాట్ సమీపంలో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 26 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.