byసూర్య | Tue, Jan 22, 2019, 12:17 PM
సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు యాగం ప్రారంభించారు. ఇవాళ చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర చండీయాగానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లి ప్రతిధ్వనిస్తోంది.