byసూర్య | Mon, Jan 21, 2019, 12:51 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ 75 శాతం నమోదైందని ఎస్ఈసీ పేర్కొంది. 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు.