byసూర్య | Mon, Jan 21, 2019, 12:19 PM
సిబిఐ డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణనుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. సిబిఐ డైరెక్టర్ నియామక కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈ పిటిషన్ విచారణనుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ పిటిషన్ను ఈ నెల 24వ తేదీన మరొక ధర్మాసం విచారణ చేపట్టనున్నది.