byసూర్య | Mon, Jan 21, 2019, 12:14 PM
హైదరాబాద్: తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ రైల్వేశాఖకు కాసుల వర్షం కురిపించింది. ఈనెల 11 నుంచి 14 వరకు దాదాపుగా 4.49 లక్షల మంది సాధారణ ప్రయాణికులు వివిధ రైళ్లలో ప్రయాణించారు. గతేడాది 3.79 లక్షల మంది వెళ్లగా.. ఈసారి జంట నగరాల నుంచి అదనంగా 18 శాతం ప్రయాణించారు. గతేడాది రూ.3.08 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.3.99 కోట్ల ఆదాయం (29 శాతం అదనంగా) వచ్చినట్లు అధికారులు తెలిపారు