byసూర్య | Mon, Jan 21, 2019, 12:54 PM
బ్యాంకులను కోట్లాది రూపాయిల మేరకు మోసగించి విదేశాలకు పరారైన నేరస్థులందరినీ భారత్కు తీసుకు వచ్చి విచారణ జరుపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సి తన భారత పౌరసత్వం వదులుకోవడంపై రాజ్నాథ్ స్పందించారు. తమ ప్రభుత్వం పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును ఆమోదించిందని ఆయన చెప్పారు. పరారీలో ఉన్నవారినందరినీ తీసుకు వస్తామని ఆయన చెప్పారు. అయితే ఇది కొంత సమయం పట్టవచ్చునని ఆయన అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయిలు మోసగించి పరారైన మెహుల్ చోక్సి తన పాస్పోర్టును ఆంటిగువా ప్రభుత్వానికి అప్పగించి భారత పౌరసత్వం వదులుకున్నాడు.