byసూర్య | Mon, Jan 21, 2019, 12:00 PM
వారణాశి : పదిహేనో ప్రవాసీ భారతీయ దివస్ సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. దీంతో విదేశాల నుంచి వస్తున్నవారితో వారణాశి విమానాశ్రయం కిటకిటలాడుతోంది. తక్కువ సౌకర్యాలు ఉన్న వారణాశి విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న విమానాలను ఎక్కడ నిలపాలో తెలియక సతమతమౌతున్నామని ఎయిర్ పోర్ట్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ రాయ్ చెప్పారు. సుమారు 33 విమానాలు మాత్రమే నిలిపివుంచగల ఈ విమానాశ్రయంలో రాత్రిపూట కార్యకలాపాలు జరగవు. ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనడానికి 193 దేశాల నుంచి భారతీయులు వస్తున్నారు.