byసూర్య | Mon, Jan 21, 2019, 11:55 AM
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు ఓ కుటుంబం కుల మహిష్కరణకు గురైంది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని 6వ వార్డు ఎస్సీకి రిజర్వ్ అయింది. మహేందర్, విష్ణువర్దన్, శేఖర్ లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని మహేందర్ ను కులస్తులంతా ఆదేశించారు. అయితే, పోటీ నుంచి తప్పుకునేందుకు మహేందర్ ఒప్పుకోలేదు. దీంతో, ఆగ్రహించిన కుల పెద్దలు మహేందర్ పై కుల బహిష్కరణ విధిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇకపై మహేందర్ తో ఎవరూ మాట్లాడరాదని, ఎలాంటి కార్యక్రమాలకు పిలవరాదని ఆదేశించారు.