byసూర్య | Mon, Jan 21, 2019, 11:52 AM
న్యూఢిల్లి : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. బడ్జెట్ పత్రాల ప్రచురణ ప్రారంభానికి ముందు హల్వా తయారు చేయడం ఆచారంగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా, కార్యదర్శి సుభాష్ గార్గ్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.