byసూర్య | Sat, Jan 19, 2019, 03:43 AM
తెలంగాణ జాగృతి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు శనివారం ఉదయం ప్రారంభం కానుంది. హైదదరాబాద్ హెచ్ఐసీసీ లోని నోవాటెల్ హోటల్లో సదస్సు జరగనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సదస్సు ఉద్దేశ్యాలను వివిధ దేశాలనుంచి విచ్చేసిన ప్రతినిధులకు శుక్రవారం రాత్రి నోవాటెల్ లో జరిగిన కార్యక్రమంలో వివరించారు. గాంధీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధనతో పాటు నూతన ఆవిష్కరణలు కోసం సదస్సులో యువ నాయకులు చర్చించాలని ఎంపి కవిత కోరారు. సదస్సు లో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన పద్మభూషణ్ అన్నాహజారే కు కవిత పుష్పగుచ్ఛం అందచేసి స్వాగతం పలికారు.