byసూర్య | Sat, Jan 19, 2019, 03:46 AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి కోసం పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు తదితరులు పోటీపడ్డారు. మల్లు ప్రస్తుతం మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.