byసూర్య | Fri, Jan 18, 2019, 06:08 PM
టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం పని చేస్తానని, తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని వంటేరు ప్రతాప్ రెడ్డిఅన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో ఆయన చేరారు. అనంతరం, వంటేరు మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు. కేసీఆర్పై వ్యక్తిగత ద్వేషమంటూ ఏమీలేదని.. ఎన్నికల్లో గెలవాలని మాత్రమే పోరాటం చేశానని.. వంటేరు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ.. గతంలోనే పార్టీలోకి రావాలని కేటీఆర్ మూడు సార్లు కోరారని.. అప్పుడే చేరి ఉంటే బాగుండేదన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల్లో కేసీఆర్కు రైతులు అండగా నిలిచారని వంటేరు కితాబిచ్చారు.