ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్ధవంతంగా నిర్వహిస్తా: వంటేరు ప్రతాప్ రెడ్డి

byసూర్య | Fri, Jan 18, 2019, 06:08 PM

టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం పని చేస్తానని, తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని వంటేరు ప్రతాప్ రెడ్డిఅన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో ఆయన చేరారు. అనంతరం, వంటేరు మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు.  కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషమంటూ ఏమీలేదని.. ఎన్నికల్లో గెలవాలని మాత్రమే పోరాటం చేశానని.. వంటేరు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ.. గతంలోనే పార్టీలోకి రావాలని కేటీఆర్ మూడు సార్లు కోరారని.. అప్పుడే చేరి ఉంటే బాగుండేదన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు రైతులు అండగా నిలిచారని వంటేరు కితాబిచ్చారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM