by సూర్య | Tue, Jan 12, 2021, 12:41 PM
దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తోన్న సర్కారు వారి పాట చిత్రం జనవరి 25నుండి దుబాయ్ లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో హీరోగా మహేశ్ బాబు నటిస్తున్నాడు. కాగా ముందుగా హైదరాబాద్లో షూటింగ్ ప్లాన్ చేసినప్పటికీ, పలు కారణాల వలన టీం దుబాయ్కు వెళుతున్నట్టు తెలుస్తుంది. అక్కడే దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. రెండో షెడ్యూల్ మాత్రం హైదరాబాద్లో జరుగుతుందని సమాచారం. సోషల్ మెసేజ్తో తెరకెక్కనున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బ్యాంక్ మేనేజర్ పాత్రలో కనిపించనున్నాడట. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని పరశురాం తెరకెక్కించనుండగా, ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుంది. మూడు నెలలోనే సినిమా షూటింగ్ పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని తెలుస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News