by సూర్య | Tue, Jan 12, 2021, 12:25 PM
కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' అనే సినిమాను చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదలయ్యింది. ప్రశాంత్ నీల్ రానున్న రోజుల్లో వరుసగా ప్రభాస్ తో సమావేశం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్.. ఫిబ్రవరి మొదటి వారంలో సలార్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో దిశాపటానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2 టీజర్ రెండు రోజుల క్రితం విడుదలయ్యింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.