ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు'

by సూర్య | Thu, May 02, 2024, 08:40 PM

నిహారిక కొణిదెల తన యాక్టింగ్ కెరీర్‌తో పాటు వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నిహారిక వెండితెరకు కొత్త ముఖాలను పరిచయం చేస్తూ తన తొలి చలన చిత్రాన్ని ప్రారంభించనుంది. ఈ సినిమాకి 'కమిటీ కుర్రోళ్లు' అనే టైటిల్‌ ని లాక్ చేసారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని T-సిరీస్ సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి కీలక పాత్రలో నటిస్తున్నారు.


శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంతో యధు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ Fri, May 17, 2024, 02:07 PM
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM