by సూర్య | Tue, Jan 14, 2020, 04:25 PM
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ 9వ తేదీన విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో రజిని మేనియా తగ్గలేదని దర్బార్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. రజనీకాంత్తో రోబో చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో నిర్మించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దర్బార్ 4 రోజుల్లో 7.57 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 3.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక తమిళనాట 3వ రోజున అంటే జనవరి 11వ తేదీన ఒక్క రోజునే ఈ సినిమా 30 కోట్లను వసూలు చేయడం రికార్డ్గా మారింది. దీంతో ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నాలుగు రోజుల్లోనే దర్బార్ అక్కడ లాభాల బాట పట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన మొదటి పాన్ ఇండియన్ మూవీ. దర్బార్ మొదటి ఐదు రోజులకుగాను రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ లైకా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుందంటూ రాసుకుంది.'
Latest News