by సూర్య | Tue, Jan 14, 2020, 04:06 PM
ఈ సంక్రాంతికి జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ విడుదల కాగా..జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో విడుదల అయ్యింది. ఇక దేశ వ్యాప్తం గా కూడా ఈ రెండు చిత్రాలు తమ సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ , అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో చిత్రాలు విడుదలైన అన్ని సెంటర్ లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి . మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ లో ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. అనూహ్యంగా రెండు చిత్రాలు సమానమైన మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ కలిగివున్నాయి. ఈ వీకెండ్ జనవరి 10 నుండి 12 వరకు యావరేజ్ మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ లో ఈ రెండు చిత్రాలు సమానంగా 93% ఆక్యుపెన్సీ కలిగివున్నాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Latest News