byసూర్య | Wed, Apr 24, 2024, 01:52 PM
నిర్మల్ జిల్లా భైంసాలో నీటి కోసం ప్రజలు రొడెక్కారు. బుధవారం కిసాన్ గల్లీ వసూలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. రెండు వారాలుగా నీటి సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.