మూసీ నిర్వాసితులకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడి

byసూర్య | Sat, Oct 26, 2024, 08:35 PM

హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, అందుకే విషప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందన్నారు.నిర్వాసితులకు అద్భుతమైన టవర్స్ నిర్మించి అందులో ఉంచుతామని, వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. బాధిత డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.నరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను భట్టివిక్రమార్క సందర్శించారు. రియాల్టీ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్యాంకర్లతో చర్చించి రుణం అందేలా చూస్తామన్నారు. హైడ్రాపై ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్కులు, చెరువులు, గుట్టలను రక్షించేందుకే హైడ్రా అని స్పష్టం చేశారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM