ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్.

byసూర్య | Wed, Oct 23, 2024, 11:34 AM

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 24న ఆదిలాబాద్ లో చేపట్టనున్న కార్యక్రమంలో పాల్గోనున్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని తెలిపారు మాజీమంత్రి జోగు రామన్న.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అ న్నారు. అధికారంలోకి వచ్చిన 300 రోజుల్లో 300మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్‌ శంఖారావం పూరించనున్నారని, ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో పార్టీ నాయకులు రమేశ్‌, అజయ్‌, నారాయణ, వేణుగోపాల్‌ యాదవ్‌, పాల్గొన్నారు.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM