హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల భూ సేకరణకు 6.96 కోట్లు మంజూరు

byసూర్య | Sun, Oct 20, 2024, 10:25 PM

వేములవాడ తిప్పాపూర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం 6 కోట్ల 96 లక్షల రూపాయలు మంజూరు చేసి కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 లో ప్రారంభమైన వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు భూసేకరణ నిధులు కేటాయించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లగా భూసేకరణ నిమిత్తం 6 కోట్ల 96 లక్షల నిధులు మంజూరు అయి జిల్లా కలెక్టర్ పిడి ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఈ హై లెవెల్ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.


Latest News
 

బస్సు సౌకర్యం కావాలని మంత్రికి వినతి Tue, Oct 22, 2024, 02:39 PM
విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM