మూసీ ప్రక్షాళన ఇష్యూ.. కేటీఆర్‌పై మండలి ఛైర్మన్ గుత్తా ఫైర్

byసూర్య | Fri, Oct 18, 2024, 09:30 PM

తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాఫిక్‌గా మారింది. దీని చుట్టే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించి.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మూసీ సుందరీకరణ కాదని.. పునర్జీవనం చేస్తున్నామని చెప్పారు. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్, హరీష్, ఈటల ఒకరోజు నది ఒడ్డున స్టే చేయాలని సవాల్ విసిరారు. ఇక రేవంత్ ప్రెస్‌మీట్‌కు కౌంటర్‌గా నేడు బీఆర్ఎస్ పార్టీ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.


ఈ ననేపథ్యంలో మూసీ ప్రక్షాళన అంశంపా తాజాగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తూ.. సీఎం రేవంత్ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని ఆకాశానికెత్తారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. మూసీ నదికి సీఎం రేవంత్ పునర్జీవనం తీసుకొస్తున్నారని.. ఇంతటి గొప్ప పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలని సూచించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా విమర్శించాలని.. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం పార్టీలకు అతీతంగా తప్పకుండా అభినందించాలన్నారు.


మూసీ ప్రక్షాళన విషయంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. గతంలో కేటీఆర్ చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయనపై ఫైరయ్యారు. హైదరాబాద్‌ నగరంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్తిగా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని చెప్పారు. మూసీ కాలుష్యం మొత్తం నల్లగొండ జిల్లాకే వస్తోందని ఛైర్మన్ గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయంలో మాజీ సీఎం కేసీఆర్ సైతం మూసీ ప్రక్షాళనకు బోర్డు ఏర్పాటు చేశారనే విషయాన్ని గుర్తుచేశారు.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రాను ఆయన స్వాగతించారు. అక్రమాల కూల్చివేతల్లో వేగం పెంచి పనిచేయాలని హైడ్రా అధికారులకు సూచించారు. మూసీ ఒడ్డున ప్రజల దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్నారని.. మూసీ ప్రక్షాళన ద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ ఎదుగుతుందని ఛైర్మన్ గుత్తా వ్యాఖ్యానించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM