byసూర్య | Fri, Oct 18, 2024, 04:28 PM
ఈనెల 31న దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని మాజీ మంత్ర, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం పలికారు. శుక్రవారం వెస్ట్ మారేడు పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ ట్రస్ట్ శశికళ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేడుకలకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు.