byసూర్య | Thu, Oct 17, 2024, 03:51 PM
వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాల్మీకి సామాన్య వ్యక్తిగా జీవించి బోయవాణిగా జీవితం గడిపి సప్తఋషులు బోధనల ద్వారా మహర్షిగా మారి అద్భుతమైన రామాయణాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.