ఎన్ఆర్ఐ రావెళ్ల సాయి శ్రీ కి ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అభినందనలు.

byసూర్య | Thu, Oct 17, 2024, 03:47 PM

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న రావెళ్ల కృష్ణారావు కుమార్తె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, అభిమానంతో అమెరికా నుండి దసరాకు తిరిగి ఇండియా వచ్చారు. దసరా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని, సందడి చేశారు. మరల అమెరికా వెళుతున్న సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి కలిసి అభినందించారు.
సాఫ్ట్వేర్ రంగంలో రాణించి కోదాడ పట్టణానికి పేరు తేవాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణ నివాసంలో ఆమె మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబుతో కలిసి రాయల  సాయిశ్రీ కి అభినందనలు తెలుపుతూ మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందాలన్నారు. ఈ సందర్భంగా సాయి శ్రీ మాట్లాడుతూ, దసరా సందర్భంగా అమెరికా నుండి జన్మభూమి కోదాడకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అమెరికాలో కూడా ఘనంగా పాటిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేమూరి విద్యాసాగర్ రావు , సుంకర నాగయ్య, లైటింగ్ ప్రసాద్ ,తదితరులున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM