byసూర్య | Thu, Oct 17, 2024, 02:45 PM
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం మునావత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం దత్తు అనే పదమూడేళ్ళ బాలుడు అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. భూ తగాదాల కారణంగా తండాకు చెందిన నలుగురు వ్యక్తులు చంపి ఉరేసారని కుటుంబసభ్యులు అంటున్నారు.
గురువారం పోలీసులు తండాలో విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడు హైదారాబాద్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.