byసూర్య | Thu, Oct 17, 2024, 02:44 PM
ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించింది. అంతేగాకుండా మహాధర్నాకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను జేఏసీ నాయకులు ఆహ్వానించారు. నవంబర్ 5న మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.