byసూర్య | Wed, Oct 16, 2024, 10:24 PM
కలలు కనండి. కన్న కలలు నెరవేర్చుకోండి అంటూ ఏపీజే అబ్దుల్ కలామ్ భారతదేశ యువత ఇచ్చిన స్ఫూర్తి అమోఘం అని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. ఈరోజు మాజీ భారత రాష్ట్రపతి, స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలామ్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి చైర్ పర్సన్ గారు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, ఇన్చార్జి కమిషనర్ రాకేష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.