ఆత్మకూర్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

byసూర్య | Wed, Oct 16, 2024, 09:45 PM

ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు  టాయిలెట్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.  మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు.విద్యా వనరుల కేంద్రంలో  ప్రభుత్వ పాఠశాలలకు  పంపిణీ చేయాల్సిన  పాఠ్యపుస్తకాల  గురించి కలెక్టర్ ఎంఈఓ  విజయ్ కుమార్ ను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో  తాగునీరు, టాయిలెట్స్, మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాటి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, టాయిలెట్స్  మరమ్మత్తు పనులను  త్వరగా పూర్తి చేయాలని  ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. వాటి పనులను మొదలుపెట్టి  త్వరగా పూర్తిచేసేందుకు  చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం  నాణ్యతతో  ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  అందించపాల్గొన్న. ఈ సందర్భంగా తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM