పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి

byసూర్య | Thu, Oct 24, 2024, 02:48 PM

తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలను కాపాడాలని కోరారు. ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు.లొసుగులు వాడుకొని పార్టీలన్నీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడింది రాజీవ్‌గాంధీ ఒక్కరేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, సుస్థిరంగా ఉందని చెప్పారు. అయితే, ఫిరాయింపుల వల్ల పార్టీ ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక హైకమాండ్‌కు లేఖ రాస్తున్నట్టు జీవన్‌రెడ్డి తెలిపారు


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM