కూకట్‌పల్లిలో 6 కోట్లకు స్థలం కొనుగోలు.. డబ్బులు కట్టాక అసలు విషయం తెలిసి షాక్

byసూర్య | Wed, Oct 16, 2024, 07:37 PM

హైదరాబాద్‌లో ఖరీదైన ఏరియాల్లో కూకట్ పల్లి ఒకటి. అక్కడ భూములు, ఇండ్ల రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్కడి జీవన విధానం కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌, విద్యాసంస్థలు కూడా అక్కడ ఎక్కువగా ఉండటంతో పాటు గచ్చిబౌలి, మియాపూర్ లాంటి వర్కింగ్ ప్లేస్‌లకు అతిదగ్గరగా ఉండటం వల్ల.. కూకట్‌పల్లి ప్రాంతానికి అంత డిమాండ్ ఉంటుంది. అయితే.. ఇక్కడ చాలా వరకు ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులే ఎక్కువగా నివాసం ఉండటం కూడా డిమాండ్‌కు కారణం. అలాంటి కూకట్‌పల్లి పరిసరాల్లోని ఓ ప్రాంతంలో స్థలం కొనాలనుకున్నాడు ఓ వ్యాపారి. అందుకోసం ఓ స్థలం కూడా చూశాడు. సగం వరకు డబ్బులు కూడా కట్టాడు. అప్పుడు.. సావు కబురు సల్లగా తెలిసింది. తాను కొనాలనుకున్న ఎకరం భూమి మొత్తం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని తెలిసి కంగు తిన్నాడు.


మణికొండకు చెందిన రంజిత్‌ కుమార్‌ (43) అనే వ్యాపారవేత్త కూకట్‌పల్లిలోని ఒక ఎకరం భూమిని విక్రయించారు. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా అధికారులు చేపట్టిన మహోత్తర యజ్ఞంలో భాగంగా.. అధికారులు సర్వే చేస్తుండగా.. రంజిత్ కుమార్ కొనుగోలు చేసిన భూమి అంబర్‌చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలిసి రంజిత్ కుమార్.. మొదట షాక్ అవ్వగా.. ఆ తర్వాత తేరుకుని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను మోసపోయినట్టు.. తనకు జరిగిన మోసం గురించి వివరించాడు.


2021లో తాను స్థలం కొనాలని ప్రయత్నిస్తున్న సమయంలో.. కూకట్‌పల్లి పరిధిలోని బాగ్ అమీర్‌‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తనను కలిశారని రంజిత్ కుమార్ తెలిపారు. తమకు బాగ్ అమీర్ గ్రామంలో 10 ఎకరాల 3 గుంటల భూమిని ఉందని తనతో చెప్పినట్టు వివరించాడు. దీంతో.. తాను ఓ ఎకరం భూమి కొనాలని నిర్ణయించుకుని వారితో చర్చలు జరపగా.. చివరికి 6 కోట్లకు ఎకరం భూమిని అమ్మేందుకు అంగీకరించినట్టు తెలిపారు. సేల్ అగ్రిమెంట్‌పై సంతకం చేసినప్పుడు మొదట రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానని.. ఆ తర్వాత మార్చి 2022 నాటికి మొత్తం 2.9 కోట్లు చెల్లించానని రంజిత్ కుమార్ తెలిపారు.


అయితే.. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయమని కోరగా.. ఆ స్థలం అంబర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయంపై వారిని అడిగితే.. భూసేకరణ పరిహారం, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కుల (TDR) విక్రయం ద్వారా తన డబ్బును తిరిగి పొందవచ్చని మాయమాటలు చెప్పి తనను ఒప్పించారని రంజిత్ కుమార్ వివరించాడు. తనను మాయచేయటంతో.. తిరిగి పొందలేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం చేసినట్టు చెప్పుకొచ్చాడు. తనకు స్థలం అమ్మిన వ్యక్తులు.. తనను తప్పుదోవ పట్టించి మోసం చేశారని రంజిత్ కుమార్ ఆరోపించారు.


దీంతో.. రంజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు.. మోసం, నేరపూరిత బెదిరింపు, నేరపూరిత నమ్మక ద్రోహం కింద కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అభివృద్ధి ప్రయోజనాల కోసం భూమిని ప్రభుత్వం సేకరించే ప్రక్రియలో ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అతను అంగీకరించిన మొత్తంలో ఎక్కువ భాగం చెల్లించిన తర్వాత మాత్రమే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM
బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన Sat, Oct 26, 2024, 01:02 PM
పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM