మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

byసూర్య | Wed, Oct 16, 2024, 07:33 PM

మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు.. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జయింది. చనిపోయిన ఏడుగురిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వారంతా పాముబండా తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.


ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారిపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.


ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటికి తీసి.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఆ ఏడుగురు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. వారిది పాముబండ తండా అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM