byసూర్య | Tue, Oct 15, 2024, 07:46 PM
ఖమ్మం నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కార్పొరేషన్ 46వ డివిజన్లో రూ.కోటి తో నిర్మించనున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నకాలంలో నగరానికి కోట్లది రూపాయాలు తీసుకువచ్చి అభివృద్ధి చేశాను అని అన్నారు. రాబోయే కాలంలో అన్నీరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రకటించారు. అనంతరం షాదీఖానాలో జరిగిన కార్యక్రమానికి హాజరై మసీదులకు రూ.లక్ష చొప్పున చెక్కలను అందజేశారు. ఈ కర్యక్రమంలో నగర మేయర్ పి. నీరజ, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.