byసూర్య | Mon, Sep 30, 2024, 03:04 PM
అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. ఒక వేళ అనుమతి లేకుండా ఎవరైనా పై చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.