స్త్రీ వేషధారణలో బెగ్గింగ్,,,ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వసూళ్లు

byసూర్య | Sat, Sep 28, 2024, 07:08 PM

హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా మనకు బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. కొంతమంది బిచ్చగాళ్లు చిన్న పిల్లలను వెంటేసుకొని యాచకవృత్తి చేస్తుంటారు. మరికొందరు ఆడవారి వేశంలో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. జేబులో చిల్లర లేదని చెప్పినా.. వినిపించుకోరు. నగరంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ఈ యాచకుల వల్ల ఇబ్బందులు పడిన అనుభవమే. కొందరు వారిపై జాలిపడి ఎంతో కొంత సాయం చేస్తుంటారు.


  అయితే ఇందులో చాలా వరకు బెగ్గింగ్ మాఫియాలు ఉంటున్నాయి. ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడి సిగ్నల్స్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలపై పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లో భిక్షాటన చేస్తున్న చాలా ముఠాలు ఇతర రాష్ట్రాలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.


తాజాగా.. నగరంలో స్త్రీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న పురుషులను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల మొత్తం ఏడుగురు మేల్ బెగ్గర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాయాబజార్ హోటల్, ఖార్ఖానా, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద స్త్రీ వేషధారణలో వాహనదారుల నుంచి వీరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా చిన్న చిన్న దుకాణాల నుంచి కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.


కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ వీరు వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముఠా గురించి విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని అనే ట్రాన్స్‌జెండర్ ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల నుంచి పురుషులను నగరానికి రపిస్తిన్న చాందిని వారికి స్త్రీ వేషాధారణ వేయించి సిగ్నల్స్ వద్ద బలవంతంగా డబ్బులు వసూళ్లు చేయిస్తోంది. అలా వచ్చిన డబ్బుల్లో తన వాటా తీసుకొని మిగిలిన డబ్బులు వారికి ఇస్తోంది.


గత కొంత కాలంగా వీరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ టార్గెట్‌గా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై జాలిపడి డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు చెబుతున్నారు. అలా డబ్బులు ఇస్తే మోసపోయినట్లేనని.. మరికొన్ని ముఠాలు సిగ్నల్స్ వద్ద బెగ్గింగ్‌కు పాల్పడుతాయని అంటున్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM