తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్

byసూర్య | Sat, Sep 28, 2024, 07:04 PM

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా..? అని కళ్లల్లో వత్తులేసుకుని చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండటంతో రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్‌లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని చెప్పింది.


తాజాగా. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. అక్టోబరు మొదటివారంలో కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డుల కోసం గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 27) నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్‌ కార్డులకు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినవారితో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రేషన్‌ కార్డుల దరఖాస్తులు ప్రత్యేక సమావేశాల్లోనే పెట్టుకోవాలని వారికి సూచించారు. గాంధీ భవన్‌లోనూ దరఖాస్తులు తీసుకుంటామని.. ఆ తర్వాత వాటిని ఆయా శాఖల మంత్రులకు, ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు.


కాగా, ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త రేషన్‌ కార్డుల జారీపై తుది ప్రక్రియ మరో రెండు మూడ్రోజుల్లో పూర్తి కానుంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించి విధి విధానాలు ఖరారు కానున్నాయి. అక్టోబర్‌లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిచనున్నారు.


ఇక రేషన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ ఇటీవల మరో తీపి కబురు చెప్పారు. రేషన్‌కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా.. సరకులను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మీరున్న చోటే రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారున్న చోటే రేషన్ సరుకులు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. కాగా, ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించటంతో ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM