పనిచేయకుండానే లక్షల్లో జీతాలు,,,జీహెచ్‌ఎంసీలోె కొన్నేళ్లుగా నడుస్తోన్న తంతు

byసూర్య | Sat, Sep 28, 2024, 07:03 PM

ఏ పని ప్రదేశంలోనైనా పనికి తగ్గ వేతనం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే పని చేస్తేనే వేతనం అందుతుంది. కానీ జీహెచ్‌ఎంసీలో మాత్రం అలా కాదు. పని చేయకున్నా వేతనం అందుతోంది. ఇదేదో స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు కాదు. అలా అనుకున్నా పని చేస్తేనే జీతం ఇస్తారు. వీరు మాత్రం ఎటువంటి పని చేయకుండా నెలాఖరుకు వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇంట్లో ఉండి వేరే పనులు చేసుకుంటూ జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు నడుస్తోండటం అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది.


ఇలా పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న విభాగాల్లో రవాణా విభాగం ప్రధానమైనది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 1500 మంది పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వారిలో రవాణా విభాగం నుంచే దాదాపు 800 మంది వరకు ఉన్నారు. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో పని చేయకున్నా పని చేసినట్లు నటించి మరో 700 మంది ఉద్యోగులు అక్రమంగా జీతాలు తీసుకుంటున్నారు. వీరిలో హోదాలను బట్టి కొందరికి రూ. లక్షల్లో జీతాలు ఉండగా.. మరికొందరికి వేలల్లో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత రవాణా విభాగం ఇంజినీర్లు, శానిటేషన్ విభాగంలోని ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఎంటమాలజీ విభాగంలోని సీనియర్‌ ఎంటమాలజిస్టులు స్పందించకపోవటం గమనార్హం.


పని చేయకుండా జీతాలు తీసుకోవటమే కాకుండా.. అక్రమాలకు కూడా తెరతీస్తున్నారు. కవాడిగూడ పార్కింగ్‌ యార్డులో 150 వరకు లైట్‌ మోటారు, హెవీ వెహికల్స్ ఉన్నాయి. వాటి రిపేర్ల పేరుతో రూ.5 కోట్లను కొందరు ఉన్నత ఉద్యోగులు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెహికల్ టైర్లు, డీజిల్‌ కూపన్లను అమ్ముకుంటున్నట్లు కూడా తెలిసింది.


జీహెచ్‌ఎంసీ రవాణా విభాగంలో ఉద్యోగులు పని చేయకుండా జీతాలు తీసుకుంటుంటే.. ఒప్పంద కార్మికులకు మాత్రం పని భారం ఎక్కువ అవుతోంది. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే డ్రైవర్లు, ఇతర లేబర్లు కలిపి జీహెచ్‌ఎంసీలో దాదాపు 2 వేల మంది వరకు ఉన్నారు. అందులో చాలా మంది రికార్డుల్లోనే ఉంటున్నారు. కొందరు పాలకమండలి నేతలు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన వారిని ఉద్యోగులుగా చేర్పించి జీహెచ్‌ఎంసీని ఏటీఎం కార్డులా వాడేస్తున్నారు. ఇలా వారు పని చేయకుండా జీతాలు తీసుకుంటుండటంతో రోజూ విధులు నిర్వర్తించే ఉద్యోగులపై తీవ్రమైన భారం పడుతోంది. దీంతో ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM